Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 68



   ‘సాంఖ్యం’ అంటే తత్త్వజ్ఞానం. ఆత్మను గురించి విచారించాలి. ఊరికే కుతూహలంతో విచారిస్తే చాలదు. సంశయాలన్నీ తొలగే దాకా సద్గురువుల నుండి శ్రవణం చేయాలి. దానినే మననం చేయటం అవసరం. ఆ తత్త్వమే తాను అయ్యేవరకు అనుసంధాన రూపమైన నిదిధ్యాసనం చేయటం ముఖ్యం. ఇట్టివారికి వలదన్నా తప్పక ముక్తి లభిస్తుంది.

No comments:

Post a Comment