ముదిమి వచ్చే లోగా మేలుకో. దృశ్యాలను
గాని జనులను గాని నమ్మవద్దు. కడకు నీ శరీరం, ఇంద్రయాలు మున్నగు వానినీ నమ్మకు. అని
నిన్ను నట్టేట ముంచేస్తాయి. నీతో సదా కూడి ఉండే ఒక తత్త్వం ఉంది. అది జన్మజన్మల
నుండి నిన్ను అంటి ఉంది. నిన్ను అంటి ఉండేదే కాదు, అదే నీ స్వరూపం – పరమాత్మ – అదే
సచ్చిదానందం. గురువుల శరణు పొంది దాన్ని కనుక్కో. దాని జ్ఞానం వల్ల నీకు నిత్య
సుఖశాంతులు లభిస్తాయి.
No comments:
Post a Comment