Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 106

106. దేహమే దేవాలయం, అందలి జీవుడే సనాతనుడైన దేవుడు. అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగించి సోఽహం భావంతో పూజించాలి– అని శ్రుతీమతల్లి ఉపదేశించింది. మన దేహం నిజమైన దేవాలయంగా మారాలంటే, అది శుద్ధమైన ఆచారాలతో నిర్మలంగా ఉండటం అవసరం. ఇంద్రియాలకు మనస్సుకూ మంచిగుణాలను నేర్పినచో దేహం పవిత్రమైన దేవాలయం కాగలదు. అలాంటి దేహంలోనే సనాతనుడైన దేవుడు ప్రకటమగును.

No comments:

Post a Comment