Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 93

93. ప్రభుత్వాధికారులు, గొప్ప పదవులలో ఉన్నవారు పార్లమెంటు సదస్యులు, వేర్వేరు దేశనాయకులు మున్నగువారు నడుచుకున్న తీరున కొందరు వార్తాపత్రికల్లో చదివి, ‘వారు నేర్పరులు, వారు అంత బుద్ధివంతులు కారు’ మున్నగు విధాల విమర్శిస్తారు. తనకు ఏ రాజకీయానుభవం లేకపోయినా, అంతా తెలిసినవాని వలె ‘నేను’ అనే వాడు నటిస్తూ ఉంటాడు. తనకు అందరి నడతపై అభిప్రాయం తెలిపే యోగ్యత ఎక్కడిది? అని ఆలోచింపడు. ఇదే మాయా విలాసం.

No comments:

Post a Comment