Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 89

89. జనులకు తమ తమ శరీరంలో విలక్షణమైన మోహం అంటుకున్నది. కాని అదే శరీరంలో ఏదేని ఒక భాగం విడివడినచో దాన్ని తామని భావించరు. మాంసం, రక్తం, వెంట్రుకలు, మలం, మూత్రం, ముక్కులోని చెవిలోని మాలిన్యం మున్నగునవి మన శరీరం నుండి బయటకు వస్తే వాటి మీద అసహ్యబుద్ధి కలుగుతుంది. కాని అనే శరీరంలో ఉండేంతవరకు మొత్తం శరీరంలో నేననే బుద్ధి ఉంటుంది. ఇదెట్టి మోహం?

No comments:

Post a Comment