Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 116

116. పల్లెలో ఉన్నవారికి పట్టణపు గలాటా సరిపడదు. రైలు, బస్సు స్టాండులకు సమీపంలోనూ, పిండిమరల వద్దనూ వసించేవారు వాటి గలాటాను మనస్సుకు పట్టించుకోక, దానిని మరచే తమ తమ వ్యవహారం చేస్తారు. ఇలాగే, పరమాత్మ ధ్యానంలో ఉన్నవారికి ఏ కొంత సద్దు అయినా విక్షేపం అవుతుంది. అదే, లౌకికులకు, తమ ఇంట్లో జరిగే పిల్లల అల్లరి, వారి ఏడ్పులు, జగడాలు వీణాధ్వనుల వలె ఇంపుగా ఉంటాయి.

No comments:

Post a Comment