Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 91


91. ‘శరీరాదులకు నేనే అధిపతిని’ అనే అభిమానం జనులకు ఉంది. కాని, ‘ఆ నేను ఎవరు?’ అనుట మాత్రం మనకు తెలియదు. మనకు మరొకరి విచారమే ముఖ్యం కాన స్వంత విచారానికి సమయమే దొరకదు. శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆలుబిడ్డలు మున్నగు వారిలో ఒక్కొకసారి ఒక్కొకరిలో నేననే బుద్ధి ఉంటుంది. అయినా మనం నేను అనేది ఒక స్వతంత్రమైన తత్త్వమనే భావిస్తున్నాం. ఇదేమి మాయ.

No comments:

Post a Comment