Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 120

120. శిశువుకు మొదట్లో తన తల్లి పాడే మృదువైన పాటే ఇంపుగా ఉంటుంది. అది ఊయలలో ఉన్నపుడు తల్లి యొక్క జోలపాటను విని, మైమరచి నిద్రిస్తుంది. బాల్యదశలో గురువులు, పెద్దలు నేర్పే పాటలను వింటాడు. ఇంకా కొంత వయస్సు వచ్చినప్పుడు సంగీతం, నాటకాలు, సినిమాలు, జనుల తిట్లు, బస్సుల రైళ్ళ కూతలు, సంతలోని గలాటా, టపాకాయలు, నాటుబాంబులు, ఫిరంగులు మున్నగు వాటి ధ్వనులు వింటాడు. సహజమైన నిశ్శబ్దస్వరూపాన్ని మరిపించేది మాయయే కదా?

No comments:

Post a Comment