Monday, 10 July 2017

స్వామీ సచ్చిదానంద బోధలు - 92

92. మనకు ‘నేను’ అనే అజ్ఞాతపదార్థంలో చాలా గౌరవం. ‘నాకు అంతా తెలుసు’ అనే మోహం అవివేకులకు ఉంటుంది. ఎవరైనా గాని తనకు అజ్ఞానం ఉన్నా, తనను తాను అజ్ఞాని అని అనుకోడు. తనకు ఏమీ తెలియకపోయినా, అంతా తెలిసినట్లే భావిస్తాడు. ‘అతనికి అంతగా తెలీదు, ఇతనికి ఇంత మాత్రం తెలుసు. అతనికి వీరందరి కన్నా బాగా తెలుసు.’ – అని తీర్మానిస్తాడు. అయితే అందరి యోగ్యతకు విలువకట్టే తన యోగ్యత ఎంత? అనేది ఒక్క రోజుకూ ఆలోచించడు.

No comments:

Post a Comment