‘రామో విగ్రహవాన్ ధర్మః’ – మూర్తీభవించిన
ధర్మమే శ్రీరామచంద్రుడు. రామాయణంలో శ్రీరాముడు అడుగడుగునా ధర్మాన్ని ప్రదర్శించాడు.
తల్లిదండ్రులు, భార్య, సోదరులు, గురువులు, ప్రజలు మున్నగువారి ఎడ ఎప్పుడెప్పుడు
ఎలా నడుచుకోవాలో ఊరికే ఉపదేశించక, ఆచరించి చూపించాడు. కావున మనమందరం రామాయణాన్ని బాగా
విని, రామచంద్రునివలె ధర్మపరాయణులం కావాలి. ధర్మాన్ని రక్షిస్తే అది తిరిగి మనలను
రక్షిస్తుంది.
No comments:
Post a Comment