శీతలమండలాల్లో శీతలత్వం వల్ల సముద్రజలం
ఘనీభవించి, మంచుగడ్డలుగా మారి సాగరంలో తేలియాడుతుంటాయి. కొన్నివేళల అవి నౌకలతో
ఢీకొని వాటిని తలక్రిందలు చేస్తుంటాయి. ఆ మంచుగడ్డల నిజరూపం నీరే. నీరే మంచుగడ్డలై
ఉంది. ఇలాగే, అవిద్య వలన నామరూపాత్మకమైన దృశ్యాలు తోచి జనులను ఢీకొని సతమతం
చేస్తున్నాయి. ఈ దృశ్యాల అసలు రూపం నిర్వికారమైన ఆత్మయే. అదే తానుగా ఉంటూ, అంతా
అయి ఉంది.
No comments:
Post a Comment