మానవుని జీవితం ఒక ప్రయాణం. ఈ శరీరమే బండి,
ఇంద్రియాలే గుఱ్ఱాలు, బుద్ధియే బండిని నడిపేవాడు, మనస్సే కళ్ళెం. తానే బండి
యజమాని. తన ప్రయాణం సుఖంగా సాగవలెనంటే బండి, గుఱ్ఱాలు, బండిని నడిపేవాడు – ఇవన్నీ
సరిగా ఉండాలి. అప్పుడే ప్రయాణం ఎలాంటి ఒడిదొడుకులు లేక ముందుకు సాగుతుంది. సదాచారం
వల్ల శరీరం, ఇంద్రియాలు, బుద్ధి సురక్షితములై అధ్యాత్మ ప్రయాణం నిరాటంకంగా జరిగి
నిత్యసుఖమనే గమ్యాన్ని చేరుకోగలం.
No comments:
Post a Comment