ఒకసారి దివ్య సుందరీమణులు ఏకనాథస్వామివారి
ఇంటిలో ప్రత్యక్షమైనారు. స్వామివారు వారిని చూచి ‘మీరు ఎనరు?’ అని ప్రశ్నించగా,
వారు ‘మేము అష్టసిద్ధులం. మహాలక్ష్మి ఆదేశం మేరకు తమ సేవకై వచ్చాము, తమ ఆజ్ఞకు
ఎదురుచూస్తున్నాం.’ అన్నారు. అంత ఏకనాథులవారు, ‘తల్లులారా, నా ఆజ్ఞమేరకు మీరు నడుచుకొనేదే
నిజమైతే మీరు ఈ క్షణమందే ఇచటనుండి వెళ్ళిపోండి.’ అన్నారు. ఇదే విరక్తి అంటే.
పరమాత్మయే విరక్తులైన భక్తుల లక్ష్యం.
No comments:
Post a Comment