ప్రాణులందరూ ప్రతి రోజు గాఢనిద్రలో తమ
స్వరూపమైన ఆనందమునే పొందుచున్నారు. మెళుకువలోను, కలలోను ఎల్లప్పుడూ ఆనందస్వరూపంలోనే
ఉన్నా అది వారికి తెలియదు. చేపలు పావనమైన గంగానదిలోనే పుట్టి, పెరిగి, నశించినా
వాటికి తాము గంగా నదిలో ఉన్నట్టు తెలుస్తుందా? అవి గంగ మహిమను గుర్తిస్తాయా?
విచారపరులు మాత్రం గురుకృప వల్ల తమ ఆత్మ సదా అద్వయా(పరిపూర్ణా)నందమని గుర్తిస్తారు.
No comments:
Post a Comment