ఇటు అటు పరిగిడుచున్న పిల్లలను తల్లి నీటి
యందు ముంచి స్నానము చేయించినట్టే, భగవంతుడు ఆయా విషయాలవైపు పరుగిడుచున్న జనులను,
గాఢనిద్ర యందు తన ఆనందమనే సరోవరంలో మంచి విశ్రాంతిని ఇస్తున్నాడు. అయినప్పటికీ,
మేల్కొన్న వెంటనే వారి మనస్సు కుక్క తోక వలె వంకర అయ్యి విషయాలను వెన్నంటుచున్నది.
ఇలాంటి మనస్సు శ్రవణాదుల వల్ల ఆత్మ యందు కలిగినప్పుడు నిత్యసుఖశాంతులు లభిస్తాయి.
No comments:
Post a Comment