మీరు నిత్యానందసాగరంలోనే ఉంటూ, విషయాలనే
ఉప్పునీరు త్రాగడానికై ఆరాటపడుతున్నారెందుకు? మీకు దుఃఖమనే దప్పిక తీరాలా?
అలాగైతే, వెంటనే మీలోనే సదా ఉంటున్న పరమాత్మ వైపు తిరగండి. పరమాత్మ అంటే ఎవరో
కాదు, అతడు మీ ఆత్మ. ఆత్మను గురించి జ్ఞానులవల్ల వినండి. మననం చేయండి, అపుడు
ఆనందమే మీ నిత్యస్వరూపమని గ్రహించి, శాంతులవుతారు.
No comments:
Post a Comment