Saturday, 24 September 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 56



   ద్రాక్షతీగెలో అంతటా ద్రాక్షరసం నిండి ఉంటుంది. కాని అది మనకు కనిపించదు. ఆ రసం పక్వమైన పండ్లలో విశేషరూపంలో తెలుస్తుంది. ఇలాగే ఆత్మ సకల విశ్వానికి ‘రసోహమప్సు’ అన్నట్టు రసస్వరూపంగా ఉంటుంది. ద్రవపదార్థాలలో అనగా పాలు, పానకం చెఱుకు రసం, మున్నగువాటిలో రసరూపంలో తెలుస్తున్నాడు. కనుక ‘రసో వై సః’ ఆత్మ రసస్వరూపుడు అనగా ఆనందస్వరూపుడు అంటుంది శ్రుతి. అన్ని వస్తువుల్లో పరమాత్మరసం వ్యాపించి ఉంది.

No comments:

Post a Comment